Sara Ali Khan: ‘సుశాంత్ ప్రేమలో మునిగా... డ్రగ్స్ మత్తులో కాదు’

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య అంత చిన్న విషయంలా కనిపించడం లేదు. తొలుత ప్రేమ వ్యవహారంలా కనిపించి ఆపై ఆర్థిక మోసం కేసుగా మారింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుగా మారిపోయింది.

Last Updated : Sep 28, 2020, 01:07 PM IST
  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఎన్నో ట్విస్టులు
  • తొలుత ప్రేమ, ఆపై ఆర్థిక కేసులు, ఇప్పుడు డ్రగ్స్ కేసుగా మార్పు
  • కొంతకాలం సుశాంత్, నేను ప్రేమించుకున్నాం అంటున్న సారా అలీ ఖాన్
Sara Ali Khan: ‘సుశాంత్ ప్రేమలో మునిగా... డ్రగ్స్ మత్తులో కాదు’

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య అంత చిన్న విషయంలా కనిపించడం లేదు. తొలుత ప్రేమ వ్యవహారంలా కనిపించి ఆపై ఆర్థిక మోసం కేసుగా మారింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుగా మారిపోయింది. రియా చక్రవర్తితో మొదలైన డ్రగ్స్ వ్యవహారం కేసులు.. నటీమణులు సారా అలీ ఖాన్ (Sara Ali Khan), రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌లకు బిగుసుకుంది. కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.. 

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) చేపట్టిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు శనివారం హాజరైన బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సైతం నటుడు సుశాంత్‌ను ప్రేమించింది. విచారణలో అదే విషయాన్ని తెలిపింది. థాయ్‌లాండ్‌కు సుశాంత్‌తో కలిసి వెళ్లినట్లు ఒప్పుకుంది. కొంతకాలం పాటు సుశాంత్‌తో డేటింగ్ చేశానని, అతడి ప్రేమలో మునిగిపోయానని తన వాంగ్మూలం ఇచ్చినట్లు కథనాలు సైతం వైరల్ అవుతున్నాయి. తనకు కేవలం సిగరెట్ అలవాటు ఉందని, డ్రగ్స్ లాంటి వాటి జోలికి తానెప్పుడూ వెళ్లలేదని విచారణలో సారా తెలిపిందని ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుశాంత్‌కు మాత్రం డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ బాంబు పేల్చింది. 

ఇప్పటివరకూ బాలీవుడ్ నుంచి దాదాపు 30 నుంచి 40 మంది పేర్లను ఎన్సీబీ పరిశీలిస్తోంది. వారిని విచారించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సారా, శ్రద్ధా, రకుల్, దీపికలతో బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ముమ్మరం చేసింది. కరణ్ జోహర్‌ను సైతం విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమైనట్లు సమాచారం. 

 

ఇవి కూడా చదవండి

Trending News