Mokshagna Movie Muhurtam: రేపే మోక్షజ్ఞ సినిమాకు మోక్షం.. సింబాగా రాబోతున్న నట సింహం తనయుడు..

Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 5, 2024, 03:45 PM IST
Mokshagna Movie Muhurtam: రేపే మోక్షజ్ఞ సినిమాకు మోక్షం.. సింబాగా రాబోతున్న నట సింహం తనయుడు..

Mokshagna Movie Muhurtam:  నందమూరి నట సింహం బాలకృష్ణ.. రీసెంట్ గా నటుడిగా  50 యేళ్ల  ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే కదా. 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తైయిన సందర్బంగా బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై బిగ్ అప్డే ట్ చేసారు. రేపు మోక్షజ్ఞ బర్త్ డే. ఈ సందర్బంగా మోక్షు యాక్ట్ చేసే ఫస్ట్ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ను రేపు ఉదయం 10.36 నిమిషాలకు ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీని అనౌన్స్ చేస్తారా...? లేకపోతే పూజా కార్యక్రమాలతో సినిమాకు కొబ్బరికాయ కొడతారా అనేది చూడాలి.

ఏది ఏమైనా నట సింహం కుమారుడికి తగ్గట్టు  ‘సింబా’ టైటిల్ తో ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పారు. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ .. రిలీజ్ డేట్ వివరాలను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.  గత పదేళ్ల కాలంలో  బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే రేపు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ పై ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఇప్పటికే మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు రీసెంట్ గా పలు ఇంటర్వూల్లో బాలయ్య ప్రస్తావించారు. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే ఐదారు కథలను బాలయ్య ఫైనల్ చేసినట్టు సమాచారం.  

ఇక నందమూరి ఫ్యామిలి నుంచి వారసుడు వచ్చి 19 ఏళ్లు అవుతుంది.మరి ముఖ్యంగా బాలయ్య తనయుడు  మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు.అప్పట్లో  మోక్షజ్ఞ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీతో ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇప్పటికే  మోక్షజ్ఞ  డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో అమెరికాలో మంచి ట్రెయిన్ అయి వచ్చాడు. రీసెంట్ గా  మోక్షజ్ఞ స్లిమ్ అయి కొత్త లుక్ కనిపించి ఫ్యాన్స్ ను డబుల్  ఖుషీ చేసాడు.

 మోక్షజ్ఞ కొత్త సినిమాతో  శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా తెరంగేట్రం  చేయడం దాదాపు ఖాయం అనే ముచ్చట విడబడుతోంది. రేపు ఈ విషయమై అధికార ప్రకటన వెలుబడనుంది. ఈ సినిమాను వచ్చే నెక్ట్స్ ఇయర్  సమ్మర్ లో విడుదల చేసేలా  ప్లాన్ చేస్తున్నారు.  మరోవైపు మోక్షం కోసం బాలయ్య ఇప్పటికే కొన్ని కథలను ఆల్రెడీ ఫైనల్ చేసినట్టు బాలయ్య ప్రస్తావించారు. త్రివిక్రమ్,హరీష్ శంకర్, కొరటాల శివ,బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, బాబీ వంటి టాప్ దర్శకులు  మోక్షజ్ఞ కోసం స్టోరీలను రెడీ చేసినట్టు టాక్. మొత్తంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోన్న అభిమానుల ఆశలు ఇప్పటికీ ఫలించబోతున్నయన్న మాట.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News