Pooja Hegde Out and Samantha In: పూజా హెగ్డే ఔట్.. సమంత ఇన్! 4 సారి మహేష్ తో జతకట్టనున్న సామ్

స్టార్ హీరో మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపిక అయిందని వార్తలొస్తున్న నేపథ్యంలో.. పూజ ప్లేస్ లో సమంత నటించబోతుందని సమాచారం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 03:55 PM IST
  • వరుస హిట్ లతో జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
  • మహేష్-త్రివిక్రమ్ సినిమా నుండి తప్పుకున్న పూజా హెగ్డే
  • పూజా ప్లేస్ లో సమంతను ఎంపిక చేసిన మేకర్స్
  • నాలుగోసారి మహేష్ బాబుతో జతకట్టనున్న సమంత
Pooja Hegde Out and Samantha In: పూజా హెగ్డే ఔట్.. సమంత ఇన్! 4 సారి మహేష్ తో జతకట్టనున్న సామ్

Pooja Hegde out and Samantha in for Mahesh Babu-Trivikram Movie: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. అదే ఊపులో ప్రస్తుతం ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాతో మహేష్ బిజీబిజీగా ఉన్నాడు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది మహేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం. గతంలో ఇద్దరు అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 

Also Read: IND vs NZ 1st Test: మయాంక్ విఫలమయినా.. చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?

పూజా హెగ్డే ఔట్...
మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పూజా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. బుట్టబొమ్మ చేతిలో ఉన్న వరుస సినిమాలే అందుకు కారణం అట. 'రాధేశ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్‌', 'సర్కస్‌' చిత్రాలతో బిజీగా ఉన్న పూజా.. డేట్స్‌ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు సమాచారం. ఇక పూజా స్థానంలో సమంతను తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఈ విషయమై ఇప్పటికే సమంతను సంప్రదించగా.. ఆమె ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

మహేష్ బాబుతో నాలుగోసారి...
మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రానున్న సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' తర్వాత మహేశ్‌-సమంత కాంబినేషన్‌లో రానున్న నాలుగో చిత్రం కానుంది. దూకుడు, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు బంపర్ హిట్ కొట్టగా.. బ్రహ్మోత్సవం పెద్ద డిజాస్టర్ అయింది.

Also Read: Sampoornesh Babu: 'అమీర్ ఖాన్ తర్వాత ఆ సీన్ నేనే చేశా.. బంధువులు, స్నేహితులు ఆడేసుకున్నారు'

త్రివిక్రమ్-మహేష్ కలయిక కాబట్టి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌ స్టార్‌ ఫాన్స్ ఈ కాంబినేషన్‌ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. 

విలన్ పాత్రలో విక్రమ్‌....
ఈ సినిమాకు సంబందించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విలన్ పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరో శియాన్ విక్రమ్‌ని తీసుకుంటున్నారట. స్టార్ హీరోలు అయిన అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి నెగటివ్ రోల్స్ చేసి మెప్పించడంతో.. దర్శకులు ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మొత్తానికి శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, సామీ వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విక్రమ్‌.. ఇప్పుడు విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే...

మరి మహేష్-విక్రమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News