Prabhas Fans Vs Mega Fans: బాధలో ఉండగా ఇదేం పంచాయితీ? ప్రభాస్-చిరంజీవిలకి పోలిక ఎందుకు?

Prabhas Fans Vs Mega Fans Regarding a Banner at Krishnamraju Condolence Meet: మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ పోస్టర్ల ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 30, 2022, 06:08 AM IST
  • మొగల్తూరులో ఘనంగా కృష్ణంరాజు సంస్మరణ సభ
  • హాట్ టాపిక్ గా ప్రభాస్ పోస్టర్ల ప్రదర్శన
  • మెగా ఫాన్స్ vs ప్రభాస్ ఫాన్స్ గా వ్యవహారం
Prabhas Fans Vs Mega Fans: బాధలో ఉండగా ఇదేం పంచాయితీ? ప్రభాస్-చిరంజీవిలకి పోలిక ఎందుకు?

Prabhas Fans Vs Mega Fans Regarding a Banner at Krishnamraju Condolence Meet: టాలీవుడ్ లో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఫాన్ వార్ జరగడం చాలా మామూలే. గతంలో మెగాస్టార్ చిరంజీవి- బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ -మహేష్ బాబు అభిమానులు, పవన్ కళ్యాణ్ -ప్రభాస్ అభిమానుల మధ్య అడపాదడపా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉండేవి. కానీ తాజాగా జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభ నేపథ్యంలో అక్కడ ప్రభాస్ అభిమానులు ప్రదర్శించారని చెబుతున్న ఒక బ్యానర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి నిన్న కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని వేల కేజీల చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలతో సుమారు 70 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిది కూడా మొగల్తూరు కావడంతో ప్రభాస్ చిరంజీవిని కంపేర్ చేస్తూ ఒక పోస్టర్ ను ప్రచురించి చూపడం హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటివరకు చిరంజీవి రావడం చూశారు, పవన్ కళ్యాణ్ రావడం చూశారు కానీ 12 ఏళ్ల తర్వాత ఒక రాజు వస్తే ఇలాగే ఉంటుంది అంటూ ప్రభాస్ నిలబడి ఉన్న ఒక పోస్టరును ప్రచురించడం ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News