Virupaksha Pre Release: సాయి ధరమ్ తేజ్ కెరియర్లో అత్యధిక బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందంటే?

Virupaksha Pre Release Business: సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సినిమా ఏయే ప్రాంతంలో ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 19, 2023, 07:47 PM IST
Virupaksha Pre Release: సాయి ధరమ్ తేజ్ కెరియర్లో అత్యధిక బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందంటే?

Sai Dharam Tej Virupaksha Pre Release Business: ఆ మధ్యకాలంలో ఒక బైక్ యాక్సిడెంట్ వల్ల దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 21 తేదీన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది.

ఆయన కెరీర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి.

Also Read: Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!

ఈ సినిమా హక్కులు ఏ ఏ ప్రాంతాలలో ఎంతకు అమ్ముడుపోయాయి? అనే విషయాలు కూడా ఇప్పుడు వెల్లడయ్యాయి. ఇక ఆ వివరాల ప్రకారం నైజాం ప్రాంతంలో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ఏడు కోట్ల రూపాయల మేరకు అమ్ముడుపోయింది. సీడెడ్ ప్రాంతంలో మూడు కోట్ల 70 లక్షలు, మిగతా ఆంధ్ర ప్రాంతం అంతా కలిపి ₹8 కోట్ల యాభై లక్షలకు ఈ సినిమా అమ్ముడుపోయింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో 19 కోట్ల 20 లక్షలకు ఈ సినిమా అమ్ముడుపోయింది.

ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి కోటి యాభై లక్షలకు అమ్ముడుపోతే ఒక్క ఓవర్సీస్ లో కోటి యాభై లక్షలకు అమ్ముడుపోయింది. తద్వారా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 22 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా 23 కోట్ల 50 లక్షలు వసూలు చేస్తే హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

సాయి ధరంతేజ్ చివరిగా నటించిన రిపబ్లిక్ సినిమాకి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే సోలో బతికే సో బెటర్ సినిమాకి 9 కోట్ల 20 లక్షలు ప్రతిరోజు పండగే సినిమాకి 17 కోట్ల 80 లక్షల పెరిగి రిలీజ్ జరిగింది తేజ్ కెరియర్లో ఇప్పటివరకు ఈ ప్రతిరోజు పండగే సినిమా ఒక్కదానికే అత్యధిక పరి రిలీజ్ బిజినెస్ జరిగింది ఇప్పుడు దాన్ని దాటేసి విరూపాక్ష ఏకంగా  22 కోట్ల 20 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. 

Also Read: IT Raids On Mythri: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ఇళ్లపై రైడ్స్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల హ్యాండ్ కూడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News