Samantha Cries at Shaakuntalam Trailer Launch event సమంత శాకుంతలం ట్రైలర్ను సోమవారం నాడు విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం సమంత బయటకు వచ్చింది. అసలే సమంత మయోసైటిస్తో బాధపడుతున్నా కూడా శాకుంతలం కోసం బయటకు వచ్చింది. అయితే ఈ ఈవెంట్లో గుణ శేఖర్ మాట్లాడుతూ కంటతడిపెట్టేశాడు. ఈ సినిమా కోసం దిల్ రాజు అందించిన సాయం గురించి చెబుతూ గుణ శేఖర్ ఎమోషనల్ అయ్యాడు.
ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉంటే.. తమ లాంటి మేకర్లు సినిమాలు తీయగలరని చెబుతూ.. శాకుంతలం సినిమా క్రెడిట్ను దిల్ రాజుకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు గుణ శేఖర్. అయితే గుణ శేఖఱ్ మాట్లాడుతూ ఉండగా.. సమంత కన్నీరు పెట్టేసుకుంది. ఇక సమంత మాట్లాడుతూ.. తాను ఇలా బయటకు రావడానికి కారణం.. గుణ శేఖర్ గారి మీదున్న ప్రేమ, అభిమానం అని చెప్పుకొచ్చింది. తాను శక్తినంతా కూడబెట్టుకుని వచ్చాను.. సమంత తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి