సై రా సెట్‌లో అమితాబ్, చిరంజీవితో పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సై రా నరసింహారెడ్డి’.

Last Updated : Aug 27, 2018, 04:10 PM IST
సై రా సెట్‌లో అమితాబ్, చిరంజీవితో పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సై రా నరసింహారెడ్డి’. ఈనెల 21న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సై రా ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ సెట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి 151వ సినిమా సెట్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, హీరో రామ్‌చరణ్‌తో పవన్ దిగిన ఫోటో ఇది. ఆనాడు షూటింగ్ జరిగేటప్పుడు ప‌వ‌న్ కళ్యాణ్ అక్కడి వెళ్లిన‌ట్లు అప్పట్లోనే వార్తలు రాగా.. ఆనాటి ఫోటో ఇప్పడు విడుద‌ల కావ‌డంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చన్, న‌య‌న తార‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, తమన్నా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ మూవీలో సైరా న‌ర‌సింహ‌రెడ్డి గురువు పాత్రలో అమితాబ్ క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ సంగీత ద‌ర్శకుడు అమిత్ త్రివేది ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్‌చరణ్ ఈ సినిమాను సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

 

Amitabh Bachchan with Pawan Kalyan, Chiranjeevi and Ram Charan on the sets of Sye Raa Narasimha Reddy in Hyderabad. #syeraanarasimhareddy #powerhouse

A post shared by BollywoodLife (@ibollywoodlife) on

 

 సై రా నరసింహా రెడ్డి టీజర్..

Trending News