కేరళ వరద బాధితులకు టాలీవుడ్ అగ్ర కథానాయకుల చేయూత

కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక నివాసాలు నేలమట్టం కావడంతో.. ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Last Updated : Aug 20, 2018, 12:22 PM IST
కేరళ వరద బాధితులకు టాలీవుడ్ అగ్ర కథానాయకుల చేయూత

కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక నివాసాలు నేలమట్టం కావడంతో.. ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మహా ప్రళయం వల్ల దాదాపు 300లకు పైగా వ్యక్తులు మరణించారు. ఈ క్రమంలో కేరళ ప్రాంతంలో ప్రభుత్వం రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. కేంద్రం ఇప్పటికే బాధితులను ఆదుకొనేందుకు గాను రూ.500 కోట్లను తక్షణం విడుదల చేయనున్నట్లు తెలిపింది.  ఈ తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రూ.10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే సామాన్య ప్రజానీకం కూడా తమకు తోచిన రీతిలో విరాళాలు పంపిస్తున్నారు. ఈ సమయంలో కేరళ వరద బాధితులుకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నామని టాలీవుడ్ చిత్ర ప్రముఖులు పలువురు తెలిపారు. కొందరు హీరోలు తాము కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపిస్తున్నట్లు కూడా తెలియజేశారు.  

తాజాగా  టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున రూ.28 లక్షలను కేరళ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు తెలియజేశారు. అలాగే నటుడు ప్రభాస్‌ రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించగా.. జూనియర్ ఎన్టీఆర్‌ రూ.25 లక్షలు, నందమూరి కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా మహేశ్‌బాబు కూడా రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. 

Trending News