'ఆ క్షణమే నా పనైపోయిందనుకున్నా' : రాహుల్

ఆ క్షణమే నా పనైపోయిందనుకున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు.

Last Updated : May 1, 2018, 07:25 AM IST
'ఆ క్షణమే నా పనైపోయిందనుకున్నా' : రాహుల్

న్యూఢిల్లీ: హుబ్లీ వద్ద విమానం పల్టీలు కొట్టినప్పుడు ఆ క్షణమే నా పనైపోయిందనుకున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ పైవిధంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకకు వెళ్ళినప్పుడు, హుబ్లీ వద్ద విమానం పల్టీలు కొట్టింది. అప్పడే ఆ క్షణమే అనుకున్నా ఇక నా పనైపోయిందని.' అని రాహుల్ చెప్పారు. ఆకాశంలో 8 వేల అడుగుల ఎత్తులో విమానం పల్టీలు కొట్టిందని ఆయన చెప్పారు.

విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సి ఉందని రాహుల్ అన్నారు. మే నెలలో కైలాస్‌ మానసరోవర్‌ యాత్రకు వెళతానని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికలు పూర్తి కాగానే పది పదిహేను రోజులు సెలవులు తీసుకుని కైలాస్‌ మానసరోవర్‌ యాత్రకు వెళ్లాలని అప్పుడే నిశ్చయించుకున్నట్లు ఆయన అన్నారు.

Trending News