బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి, ముగ్గురికి గాయాలు!

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..

Last Updated : Oct 27, 2018, 01:36 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి, ముగ్గురికి గాయాలు!

దీపావళి కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఏడుగురు చనిపోయిన దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బుద్వాన్‌లో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతినగా.. శిథిలాల కింద మరో వ్యక్తి చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News