పిడుగుపాటుకు 8 మంది చిన్నారులు మృతి

పిడుగుపాటుకు 8 మంది చిన్నారులు మృతి

Last Updated : Jul 19, 2019, 08:35 PM IST
పిడుగుపాటుకు 8 మంది చిన్నారులు మృతి

పాట్నా: బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఇంకెంతో మంది నిరాశ్రయులై రోడ్డునపడ్డారు. తాజాగా నవడ జిల్లాలోని ధనపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఎనిమిది మంది చిన్నారులు మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సర్దార్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సబ్‌ డివిజినల్‌ ఆఫీసర్‌ అనుకుమార్‌ వెల్లడించారు. 

పిడుగుపాటుకు 8 మంది చిన్నారులు బలైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌.. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

Trending News