మాయావతి విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా

బీఎస్పీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా

Last Updated : Mar 22, 2019, 06:53 PM IST
మాయావతి విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఇవాళ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 11 లోక్ సభ స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థుల పేర్లను మాయావతి ఈ జాబితాలో వెల్లడించారు. ఇటీవల జనతా దళ్-సెక్యులర్(జేడీఎస్)ని వీడి బీఎస్పీలో చేరిన కున్వర్ డానిష్ అలీకి సైతం మాయావతి అమ్రోహ లోక్ సభ టికెట్ కేటాయించారు. మిగతా బీఎస్పీ అభ్యర్థుల వివరాలిలా వున్నాయి.

 

హాజి ఫజ్‌లుర్ రహ్మాన్ -సహరాన్‌పూర్ 
మాలుక్ నాగర్ - బిజ్నోర్
గిరీష్ చంద్ర - నగిన
కున్వర్ డానిష్ అలీ - అమ్రోహ
హజి మొహమ్మద్ యాకుబ్ - మీరట్
సత్బిర్ నాగర్ - గౌతంబుద్ధ్ నగర్ 
యోగేష్ వర్మ - బులంద్‌షహర్
అజిత్ - అలీఘర్
మనోజ్ కుమార్ సోని - ఆగ్రా
రజ్విర్ సింగ్ - ఫతేపూర్ సిక్రి
రుచి వీర - అనోల

 

Trending News