Covid-19: ఒక్కరోజే వేయికి పైగా కరోనా మరణాలు

దేశంలో కరోనాకేసులు ( Coronavirus ) రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అయితే నిన్న మొట్టమొదటి సారిగా వేయికిపై మరణాలు సంభవించడంతో ఆందోళన మరింత పెరిగింది.

Last Updated : Aug 10, 2020, 02:09 PM IST
Covid-19: ఒక్కరోజే వేయికి పైగా కరోనా మరణాలు

Corona cases in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనాకేసులు ( Coronavirus ) రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అయితే నిన్న మొట్టమొదటి సారిగా వేయికిపై మరణాలు సంభవించడంతో ఆందోళన మరింత పెరిగింది. అయితే.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 62,064 కరోనా కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1007మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 22,15,074కి చేరింది. దీంతోపాటు మొత్తం మరణాల సంఖ్య 44,386కి పెరిగింది. 

కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( health ministry ) సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 6లక్షల 34వేల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 15లక్షల 34వేల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 69శాతానికి పెరగగా.. మరణాల రేటు 2శాతంగా ఉందని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Trending News