Fact Check: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందా..ఏది నిజం, సర్వే ఎవరిది

Fact Check: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పూర్తయింది. రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది. దేశంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందనే సర్వే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అవి ఎంత వరకూ నిజం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2021, 09:31 PM IST
Fact Check: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందా..ఏది నిజం, సర్వే ఎవరిది

Fact Check: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పూర్తయింది. రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది. దేశంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందనే సర్వే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అవి ఎంత వరకూ నిజం.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు(West Bengal Elections). మొత్తం 8 విడతల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. రెండవ దశ పోలింగ్ రేపు జరగనుంది. రెండవ దశలో అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గముంది. మమతా బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండగా..నిన్నటి వరకూ ఆమెకు కుడిభుజంగా ఉండి స్థానికంగా పట్టున్న సువేందు అధికారి ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపధ్యంలో నందిగ్రామ్(Nandigram)ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

నందిగ్రామ్‌లో దీదీ మమతా బెనర్జీ (Mamata Banerjee)ఘోరంగా ఓడిపోబోతుందనేది సర్వేల సారాంశం. సువేందు అధికారి..దీదీని ఓడించబోతున్నాడని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ( Prasanth kishor) కు చెందిన ఐ పాక్ (IPac)సంస్థ నిర్వహించిందనే వార్తలు ప్రజల్ని మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి. అందుకే ఐ పాక్ సంస్థ ఈ వార్తలపై స్పందించింది. తమ సంస్థ నిర్వహించిందని చెబుతున్న సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. గత కొద్దిరోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సర్వే ఒక ఫేక్ అని..బీజేపీ నేతలు వారి హామీల్లానే ఫేక్ సర్వేలు ప్రచారం చేస్తున్నారని ప్రకటన విడుదల చేసింది. ప్రచార సమయంలో ఇటువంటి ఫేక్ వార్తల్ని ప్రచారం చేసి జనాల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారని ..ఆ ప్రయత్నాలు ఫలించవని తెలిపింది. అసలు ఐ పాక్ సంస్థ డెస్క్ టాప్ ఉపయోగించదని..ఇంకాస్త స్మార్ట్‌గా ఆలోచించాలని కోరింది. 

Also read: Nandigram: నందిగ్రామ్..కేంద్ర బలగాల మయం, రేపే పోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News