India Corona Recovery Rate: ఇండియాలో 95.64 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు

India Corona Recovery Rate: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మరింత తగ్గింది. తాజాగా 73 రోజులలో అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు తగ్గింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 15, 2021, 11:10 AM IST
  • భారత్‌లో తాజాగా 60,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • తాజాగా దేశవ్యాప్తంగా 2,726 కోవిడ్19 మరణాలు సంభవించాయి
  • దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు తగ్గింది
India Corona Recovery Rate: ఇండియాలో 95.64 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు

India Corona Recovery Rate: ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 2,726 మరణాలు సంభవించాయి. అయితే ఇప్పటివరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 లక్షల 77 వేల 31కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు తగ్గింది.

Also Read: Gunfire In AP: కడప జిల్లాలో కాల్పుల కలకలం, ఒకరి హత్య, ఆపై ఏం చేశాడంటే 

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమేపీ తగ్గుతోంది. గత 75 రోజులలో అతి తక్కువ కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసులు నేడు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు 1 లక్షా 17 వేల 525 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్ఛా్ర్జ్ అయ్యారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 2,82,80,472 (2 కోట్ల 82 లక్షల 80 వేల 472) మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాలు సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. 

Also Read: Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం

కరోనా రివకరీ రేటు 95.64 శాతానికి పెరగగా, వీక్లి పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుతం 4.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.45 శాతానికి పడిపోయింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8 గంటలవరకు 17,51,358 (17 లక్షల 51 వేల 358) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇండియాలో ఇప్పటివరకూ మొత్తం 38,13,75,984 శాంపిల్స్‌కు కోవిడ్19 (Covid-19) పరీక్షలు నిర్వహించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Corona Vaccine: వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం మంచిది కాదంటున్న డాక్టర్ ఫౌసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News