Corona second wave: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ కేసులు, ఒక్కరోజులో 2 లక్షల కేసులు

Corona second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అప్పుడే రెండు లక్షల మార్క్ దాటేశాయి.  గత 24 గంటల్లో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2021, 11:21 AM IST
Corona second wave: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ కేసులు, ఒక్కరోజులో 2 లక్షల కేసులు

Corona second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అప్పుడే రెండు లక్షల మార్క్ దాటేశాయి.  గత 24 గంటల్లో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.

ఇండియాలో కరోనా మహమ్మారి(Corona pandemic) పంజా విసురుతోంది.వేసవిలో కరోనా కోరలు చాచి..మహోగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 739 కొత్త కేసులు ( India corona cases) నమోదవడం ఆందోళనగా మారింది. అటు మరణాల సంఖ్య  1038 గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా మృతి చెందివారి సంఖ్య 1 లక్ష 73 వేల 123కు చేరుకుంది. దేశంలో గతంలో ఎన్నడూ ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయనే అభిప్రాయం విన్పిస్తోంది.  

మరోవైపు కరోనా నుంచి ఇప్పటి వరకూ 93 వేల 528 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ కోటి 24 లక్షల 29 వేల 564 మంది కోలుకున్నారు. ఇక దేశంలో గత 24 గంటల్లో 13 లక్షల 84 వేల 549 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కాగా దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 26 కోట్ల 20 లక్షల 3 వేల 415కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో 33 లక్షల 13 వేల 848 మందికి వ్యాక్సిన్ వేయగా..ఇప్పటి వరకూ దేశంలో 11 కోట్ల 44 లక్షల 93 వేల 238 మందికి వ్యాక్సిన్(Corona vaccination) వేశారు. 

అటు తెలంగాణలోనూ కరోనా వైరస్ (Telangana Coronavirus cases)కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ తాజా బుల్లెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా గత 24 గంటల్లో 3 వేల 307 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మరణించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 1788 మంది మరణించారు. 

Also read: Ys Sharmila Deeksha: తెలంగాణలో వైఎస్ షర్మిల దీక్షకు ఆ నేతల మద్దతు లభించేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News