భారత్‌లో కరోనా విలయ తాండవం

India COVID19 Cases |ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కరోనా పాజిటివ్‌ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి.

Last Updated : Jul 2, 2020, 12:09 PM IST
భారత్‌లో కరోనా విలయ తాండవం

దేశంలో కరోనా వైరస్(COVID19 cases in India) రోజురోజుకూ విజృంభిస్తోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కరోనా పాజిటివ్‌ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (India COVID19 Cases) ఆరు లక్షలు దాటింది. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 6,04,641 మందికి కరోనా సోకింది. రోజుకు లక్ష కేసులు తప్పవు: ప్రముఖ వైద్యుడు వార్నింగ్

అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 434 మంది కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 17,834కు చేరుకుంది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 3,59,860 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం 2,26,947 మంది ఆస్పత్రులలో కోవిడ్19కు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News