India Covid-19: 67 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 67లక్షల మార్క్ దాటింది.

Last Updated : Oct 7, 2020, 09:56 AM IST
India Covid-19: 67 లక్షలు దాటిన కరోనా కేసులు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 67లక్షల మార్క్ దాటింది. అయితే.. గత 24గంటల్లో మంగళవారం ( అక్టోబరు 6న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 72,049 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 986 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,57,132 కి చేరగా.. మరణాల సంఖ్య 1,04,555 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 57,44,694 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,07,883 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 85.02 శాతం ఉండగా..  మ‌ర‌ణాల రేటు 1.55 శాతంగా ఉంది. అయితే యాక్టివ్ కేసుల రేటు 13.44 శాతం ఉందని వైద్యశాఖ వెల్లడించింది. అయితే పెరుగుతున్న కేసుల మధ్య ఉపశమనం కలిగించే విషయం  ఎమిటంటే.. దేశంలో రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!

ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 11,99,857 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 6 వరకు మొత్తం 8,22,71,654 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also Read :  Wearing Face Mask Issues: ఫేస్ మాస్కు ధరిస్తే నిజంగానే ఈ సమస్యలు వస్తాయా?

Trending News