కోల్కతాలోని మజెర్హత్ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. పలు వాహనదారులు, అటుగా రాకపోకలు సాగిస్తున్న ఈ దుర్ఘటనలో శిథిలాల కిందే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/9RFf7hrxCf
— ANI (@ANI) September 4, 2018
#SpotVisuals: Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/FsZGeImE4o
— ANI (@ANI) September 4, 2018
More visuals from the spot where part of Majerhat bridge in South Kolkata has collapsed. #WestBengal pic.twitter.com/Jg75o9qFzI
— ANI (@ANI) September 4, 2018
ఈ ఘటనపై ఏఎన్ఐతో మాట్లాడిన ప్రత్యక్షసాక్షులు, స్థానికులు బ్రిడ్జి కూలిపోయినప్పుడు తమ కంటపడిన దృశ్యాలను చూసింది చూసినట్టుగా వివరించారు. "ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించిందని, అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏం జరిగిందా అని వచ్చిచూస్తే, అప్పుడే బ్రిడ్జి కూలిపోయి ఉంది. అప్పటికే చాలాబైకులు బ్రిడ్జికింద ఇరుక్కుపోయాయి. ఈ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బతికున్నారో ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం" అని ప్రత్యక్షసాక్షులు ఏఎన్ఐకి తెలిపారు.
#WATCH: Eye-witnesses react after a part of Majerhat bridge in South Kolkata collapsed. #WestBengal pic.twitter.com/t1du9GDcUM
— ANI (@ANI) September 4, 2018
కోల్కతా బ్రిడ్జి కూలిన ఘటనలోఒకరు మృతి చెందగా 19 మందిని శిథిలాల కింది నుంచి సురక్షితంగా వెలికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.