PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 11, 2022, 06:53 PM IST
  • ఢిల్లీలో కొత్త శోభ
  • వేగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు
  • ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతం
PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!

PM Modi: ఢిల్లీలో కొత్త శోభ సంతరించుకుంటోంది. దేశ పార్లమెంట్ భవనం అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం పైభాగంలో మొత్తం 9 వేల 500 కిలోల కాంస్యంతో 6.5 మీటర్ల ఎత్తుతో  జాతీయ చిహ్నాన్ని తయారు చేశారు. 

చిహ్నానికి సపోర్ట్‌గా 6 వేల 500 కిలోల ఉక్కుతో సహాయ నిర్మాణం చేపట్టారు. కొత్త పార్లమెంట్ భవనంపై హై క్వాలిటీ మోడలింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌ ద్వారా జాతీయ చిహ్నాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఎనిమిది దశల్లో దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Also read:Indrakeeladri: ఇంద్రకీలాద్రిపైకి వాహనాలకు నో ఎంట్రీ..దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం..!

Also read:Chandrababu: ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందా..రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ స్టాండ్ ఇదే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News