Priyanka Gandhi: టీ తాగడానికి రావాలంటూ బీజేపీ నేతకు ఆహ్వానం

 కాంగ్రెస్ ( Congress ) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ (Anil Baluni) ని టీ తాగడానికి తన ఇంటికి రావాలని తన ఇంటికి ఆహ్వానించారు.

Last Updated : Jul 27, 2020, 10:24 AM IST
Priyanka Gandhi: టీ తాగడానికి రావాలంటూ బీజేపీ నేతకు ఆహ్వానం

Priyanka Gandhi invites new occupant: న్యూఢిల్లీ : కాంగ్రెస్ ( Congress ) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ( Anil Baluni ) ని టీ తాగడానికి తన ఇంటికి రావాలని తన ఇంటికి ఆహ్వానించారు. ప్రియాంక తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. అయితే ఆ బంగ్లాలోకి బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బలూనీ రానున్నారు. అయితే ఈ మేరకు ఎంపీ బలూనీ కుటుంబాన్ని  ప్రియాంక గాంధీ టీ తాగడానికి ఆహ్వానించారు. Also read: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి నోటీసు

ప్రియాంక ఈ మేరకు ఎంపీకు ఫోన్ చేయడంతోపాటు.. లేఖ ద్వారా కూడా ఆహ్వానం పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకూ ప్రియాంక పంపిన ఆహ్వానంపై బీజేపీ ఎంపీ ఎలాంటి స్పందనను వెల్లడించలేదు.  Also read: Sonu Sood: చంద్రబాబు అభినందనకు సోనూసూద్ ఏమన్నాడంటే.

ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని 35 లోథీ స్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఆమెకు ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఇటీవల ఉపసంహ‌రించుకుంది. దీంతో ఆ బంగ్లాను ఆగ‌స్టు ఒకటో తేదీ లోపు ఖాళీ చేయాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఆమె బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. Also read: Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

Trending News