రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం

వచ్చే నెలలో రాజస్థాన్ కో-ఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ (ఆర్సిడిఎఫ్) లోని సరాస్ కౌంటర్ల ద్వారా ప్యాక్ చేసిన ఒంటె పాలను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది

Last Updated : Dec 25, 2017, 12:53 PM IST
రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం

వచ్చే నెలలో రాజస్థాన్ కో-ఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ (ఆర్సిడిఎఫ్) లోని సరాస్ కౌంటర్ల ద్వారా ప్యాక్ చేసిన ఒంటె పాలను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

"7 కోట్ల విలువైన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపాం. జైపూర్ లో 5,000 నుండి 7,000 లీటర్ల సామర్ధ్యం గల ఒక ఒంటె పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తిదారులు ఒంటె పాలను విక్రయించవచ్చు" అని  పశుపలాన్ కళ్యాణ్ బోర్డు ఛైర్మన్, రాష్ట్ర మంత్రి  గోర్ధన్ రైనా అన్నారు. ఒంటె పాలను నిల్వ ఉంచుకోవడం కోసం కోట, అజ్మీర్, జోధ్పూర్, భరత్పూర్ ప్రాంతాల్లో శీతలీకరణ కేంద్రాలను నెలకొల్పనున్నారు.   

సారాస్ బూత్ల ద్వారా ప్యాక్ చేయబడిన ఒంటె పాలు అమ్ముడవుతాయి. అదనపు ఒంటె పాలను జైపూర్ డైరీ ప్లాంట్ కు పంపించి విక్రయిస్తామని రైనా చెప్పారు. ప్యాక్ చేయబడిన ఒంటె పాలను అమ్మడానికి మాత్రమే శీతలీకరణ అవసరం. "ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత, పాడి పరిశ్రమ మరియు బల్క్ మిల్క్ కూలర్ (బిఎంసి) లను ప్రారంభించడానికి చాలా సమయం పట్టదు" అని రైనా చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా ఒంటె పాలు విక్రయించాలనే ప్రణాళిక కూడా ఉందని చెప్పారు. 

పశుపాలన్ కళ్యాణ్ బోర్డు చీఫ్ మాట్లాడుతూ- "పరిశోధకులు ఒంటె పాలు వాడితే మధుమేహం, ఆటిజం, క్యాన్సర్, గుండె సమస్య వంటి అనేక వ్యాధులు దరిచేరవని నిరూపించారు. ఒంటె పాలు కొవ్వు కలిగి ఉండవు మరియు అది సాల్టెడ్ పాలు, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది" అన్నారు. జైపూర్ లో ప్రస్తుతం ఉన్న ప్రైవేటు డైరీలు ఒంటె పాలను అమ్ముతున్నాయి. లీటరుకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నాయని, కానీ  ప్రభుత్వం  అందుబాటు ధరల్లోనే విక్రయిస్తుందని రైనా అన్నారు. "ఒంటె పాల ధర, ఇటు ఒంటె పెంపకందారులకు, అటు వినియోగదారులకు ఇద్దరికీ  అనుకూలంగానే ఉంటుంది" అన్నారు. 

ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఒంటె పాలు ప్రాజెక్టులో చాలా "ఆసక్తిగా" ఉన్నారని ఆయన అన్నారు. "ప్రస్తుతం, మేము సరస్ పాల ప్లాంట్లో ఒంటె పాల ప్లాంట్ ను ఇప్పటికే స్థాపించాము. తరువాత భూమిని చూసి ప్లాంట్ ను ఏర్పాటుచేస్తాం " అని ఆయన చెప్పారు.

Trending News