Tamil Nadu COVID-19 Deaths: ఆ మార్క్ చేరిన రెండో రాష్ట్రం తమిళనాడు

కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 10,000 (Tamil Nadu Surpass 10,000 COVID-19 deaths)కు చేరుకుంది.

Last Updated : Oct 9, 2020, 09:11 AM IST
Tamil Nadu COVID-19 Deaths: ఆ మార్క్ చేరిన రెండో రాష్ట్రం తమిళనాడు

భారతదేశంలో కరోనా వైరస్ (CoronaVirus) ప్రభావమే లేదని, కరోనాను జయించిన దేశంగా ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకున్న స్థితి నుంచి కోవిడ్19 నుంచి కాపాడండి అనే స్థాయికి పరిస్థితి దిగజారడం తెలిసిందే. లక్షకు పైగా మరణాలు, కరోనా కేసులలో అమెరికా తర్వాత ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు (Tamil Nadu COVID-19 Deaths)లో కరోనా మరణాల సంఖ్య 10,000కు చేరుకుంది. 

ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం తమిళనాడు (Tamil Nadu CoronaVirus Deaths)లో కరోనా మరణాల సంఖ్య 10,052. గడిచిన 24 గంటల్లో 68 మందిని కరోనా బలి తీసుకుందని అధికారులు తెలిపారు. 10వేలకు పైగా కరోనా మరణాలు నమోదు చేసిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. మహారాష్ట్ర చాలా రోజుల కిందటే ఈ సంఖ్యను అధిగమించింది. దేశంలో అధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. 

తమిళనాడులోని కరోనా బాధితుల రికవరీ రేటు 90 శాతానికి పైగా ఉందని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం కరోనా కేసులు 6,40,943 నమోదు కాగా, ఇప్పటివరకూ 5,86,454 మంది రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకున్నారు. గురువారం నాటికి యాక్టివ్ కేసులు 44,437 కేసులున్నాయి. కేవలం చెన్నైలోనే ఇప్పటివరకూ 1,78,108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News