రాజ్యసభ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను వివిధ కమిటీలకు నామినేట్ చేస్తూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Nov 25, 2019, 07:35 PM IST
రాజ్యసభ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను వివిధ కమిటీలకు నామినేట్ చేస్తూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. సమాచార, ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యులుగా జోగినిపల్లి సంతోష్ కుమార్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, పరిశ్రమలు, వాణిజ్యం వ్యవహారాల కమిటీ సభ్యులుగా బండ ప్రకాశ్‌లకు చోటుదక్కింది. అలాగే రక్షణ వ్యవహారాల కమిటీ సభ్యులుగా కెప్టెన్ లక్ష్మీ కాంతా రావు, ట్రాన్స్‌పోర్ట్, హైవేస్, షిప్పింగ్ వ్యవహారాల కమిటీ సభ్యులుగా బడుగుల లింగయ్య యాదవ్‌ని నియమించారు.

Trending News