జర్నలిస్టుపై ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దాడి

కేరళలోని మల్లప్పురం ప్రాంతంలో ఓ ఫోటో జర్నలిస్టులో పై ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. 

Last Updated : May 4, 2018, 10:27 PM IST
జర్నలిస్టుపై ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దాడి

కేరళలోని మల్లప్పురం ప్రాంతంలో ఓ ఫోటో జర్నలిస్టు పై ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే నిన్న సాయంత్రం నడిరోడ్డుపై ధర్నాకి దిగిన దాదాపు 100 మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వాహనాలను అటకాయించారు. ఇటీవలే కేరళలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసనను చేపట్టారు.

అయితే అలా నిరసన చేస్తున్నప్పుడు ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఓ వాహన చోదకుడిని కొట్టారు. ఆ ఘటనను ఓ జర్నలిస్టు వీడియో తీశారు. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇద్దరు యువకులు మల్లప్పురం ప్రెస్ క్లబ్బుకి వచ్చి మరీ జర్నలిస్టు మీద చేయి చేసుకున్నారు. ఆయనను తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు కూడా చేశాయి.

ఈ కేసులో ప్రస్తుతం జర్నలిస్టుపై దాడికి పాల్పడిన ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పర్మిషన్ లేకుండా రోడ్డు బ్లాక్ చేసి వాహన చోదకులను ఇబ్బందులకు గురిచేసినందుకు మరో 10 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x