Women Climb Electric Pole: ప్రియుడు, భర్త కావాలంటూ పోల్ ఎక్కిన ముగ్గురు పిల్లల తల్లి.. వైరల్ వీడియో..

Women ExtraMarital Affair:ఇద్దరు పిల్లలున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన బైటపడటంతో ఇద్దరితోను కలిసి జీవిస్తానంటూ తెల్చిచెప్పింది. అంతటితో ఆగకుండా.. సదరు మహిళ కరెంట్ పోల్ ఎక్కి మరీ నిరసన తెలిపింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2024, 06:33 PM IST
  • ప్రియుడితో ఐదేళ్లుగా ఎఫైర్..
  • ఇద్దరు కావాలంటూ సినిమా స్టైల్ లో నిరసన..
Women Climb Electric Pole: ప్రియుడు, భర్త కావాలంటూ పోల్ ఎక్కిన ముగ్గురు పిల్లల తల్లి.. వైరల్ వీడియో..

Women Climbs Electiric Pole After busts Extramatal Affair In Uttar Pradesh: సమాజంలో కొందరు వివాహా బంధానికి ఉన్న గొప్పతనాన్ని బజారున పడేసేలా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి తర్వాత ఒకరికి తెలియకుండా మరోకరితో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఏమాత్రం తగ్గకుండా ఒకరికి మరోకరు పోటీగా నిలుస్తున్నారు. ఈక్రమంలో..కొన్ని చోట్ల పెళ్లికి ముందు ప్రేమాయణలు నడిపిస్తున్నారు. ఆ తర్వాత పెళ్లి తర్వాత.. భర్తకు తెలియకుండా, భార్యలు కొన్ని చోట్ల ఎఫైర్ లు కొనసాగిస్తుంటే, మరికొన్నిచోట్ల భార్యలకు తెలియకుండా భర్తలు వివాహేతరం సంబంధాలు పెట్టుకుంటున్నారు.

 

కొన్ని చోట్ల..పెళ్లైన తర్వాత భార్యకు తెలిసే, ఎఫైర్ లు కొనసాగించేవారు కూడా కొకొల్లలు. వివాహేతర సంబంధాల వల్ల కొందరు తమ జీవితాలను నాశనం చేసుకోవడంతోపాటు, తమ వారి ఇంట్లో వారి పరువును కూడా పోయేలా ప్రవర్తిస్తున్నారు. కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలలో పడి, తమ భార్య, పిల్లలను కొందరు వదిలేస్తే, మరికొందరు హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదు. ఈ క్రమంలో కొందరు ప్రేమించిన వాడ్ని వదల్లేక, పెళ్లి చేసుకున్న వాడ్ని వదిలేయం ఇష్టంలేక ఇద్దరితోను సీక్రెట్ ఎఫైర్ సాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. 

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గోరఖ్ పూర్ లోని పిప్రైచ్ లో జరిగిన ఈ  వ్యవహరం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోరఖ్ పూర్ లో 34 ఏళ్ల మహిళకు.. పెళ్లై, ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త రామ్ గోవింద్ సింగ్ కు తెలియకుండా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుంది. దీంతో వీరి యవ్వారం కాస్త బైటపడింది. అప్పుడు.. సదరు మహిళకు భర్తతో గొడవలు జరిగాయి. ఇద్దరితో కలిసి ఉంటాననిక కూడా మహిళ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లో వారు దూశించారు. పెద్దల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించి మరీ మహిళకు నచ్చచెప్పడం కోసం ప్రయత్నించారు. కానీ మహిళ  మాత్రం తన మంకుపట్టు అస్సలు విడువలేదు.

Read More: Snake Viral Video: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

ఈ క్రమంలో ఆవేశంతో మహిళ.. ఒక్కసారిగా ఊరిలో ఉన్న కరెంట్ పోల్ ఎక్కింది. అంతేకాకుండా.. ఇద్దరితో కలిసి జీవనంసాగిస్తానని తెల్చిచెప్పంది. అంతేకాకుండా.. తన భర్తను ఈ విషయంలో ఒప్పించాలని, ప్రియుడులేకుండా బతకలేనని కూడా రచ్చచేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.కాగా, సదరు మహిళ కూలీపనులు చేసి జీవనం సాగిస్తున్నాడని సమాచారం. ముగ్గురు కలిసి ఉంటే ఆర్థికంగా బలంగా ఉండొచ్చని, పిల్లలను బాగా చూసుకొవచ్చని మహిళ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ కావడంతో దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం విడ్డూరం బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News