వోడాఫోన్ కనెక్టివిటీపై మండిపడ్డ వినియోగదారులు

 బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని,

Last Updated : Feb 7, 2020, 05:39 PM IST
వోడాఫోన్ కనెక్టివిటీపై మండిపడ్డ వినియోగదారులు

బెంగళూరు: బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని, నగరంలోని ప్రధాన భాగాలలో వోడాఫోన్ నంబర్లపై నెట్‌వర్క్ కవరేజ్ లేదని వినియోగదారు నివేదికలు సూచిస్తున్నాయి. బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నగరం కాగా,  టెక్ స్టార్టప్‌లకు ప్రసిద్ది చెందినాడైనప్పటికీ, కొన్ని నివేదికలు వొడాఫోన్ ఐడియాకు ఉదయం నుండి నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువగా ఉందని సూచిస్తున్నాయి.

మధ్యాహ్నం 2:30 నుండి వొడాఫోన్‌లో నెట్‌వర్క్ లేదని, అవాంఛనీయ కనెక్టివిటీపై వినియోగదారులు అంతరాయం గురించి ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేశారు. ఫిర్యాదుదారులపై స్పందిస్తూ, ట్విట్టర్‌లోని అధికారిక వోడాఫోన్, ఇది తాత్కాలిక సమస్య అని, నెట్‌వర్క్ కనెక్టివిటీని నిర్ధారించడానికి బృందాన్ని నియమించినట్లు చెప్పారు. అయితే, పరిష్కరించడానికి ఎటువంటి గడువు ఇవ్వలేదు. బెంగళూరు ప్రాంతంలో వందలాది మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదురుకొంటున్నారని, ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 

బెంగళూరుతో పాటు, చెన్నై, హైదరాబాద్, ముంబైలలోని కొంతమంది వినియోగదారులు కూడా వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో అంతరాయం ఎదుర్కొంటున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News