Fennel Seeds Water: పరగడుపున గోరువెచ్చని నీటిలో ఈ గింజలను కలిపి తాగుతే ఆ సమస్యలకు చెక్‌!

Fennel Seeds Water Benefits: ఫైనల్ గింజల నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌, ఉబ్బరం, డయాబెటిస్‌ వంటి సమస్యలకు ఇది ఎంతో సహాయపడుతుంది. దీని కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 19, 2024, 10:27 AM IST
Fennel Seeds Water: పరగడుపున గోరువెచ్చని నీటిలో ఈ గింజలను కలిపి తాగుతే ఆ సమస్యలకు చెక్‌!

Fennel Seeds Water Benefits: సాధారణంగా మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు భోజనం తర్వాత సోంపును  తింటాము. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది చాలా మంది భావిస్తారు.  సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? అయితే ప్రతిరోజు ఉదయం  పరగడుపున సోంపు గింజల నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుతాయి అనేది  తెలుసుకుందాం. 

చాలా మంది ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మరి కొంత మంది శరీరంపైన పేరుకుపోయిన కొవ్వు కారణంగా వారికి నచ్చిన దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది వ్యాయామ, మందులు, యోగా అంటూ ఎక్కువగా శ్రమిస్తారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ప్రతిరోజూ ఈ ఫైనల్ నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి.  ఫైనల్ సీడ్స్‌లో ఫైబర్‌, జింక్, మాంగనీస్, విటమిన్ సి, ఐరన్‌ వంటి ఇతర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇది బరువు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఈ నీళ్లు పరగడుపున తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కూడా పోగొట్టుకోవచ్చు. సోంపు నీరు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ కూడా దూరం అవుతుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది, అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ నీటిని ఉదయం తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. 

ఎముకల నొప్పులతో బాధపడేవారు కూడా ఈ సోంపు గింజలను తీసుకోవడం వల్ల వాపు సమస్యలు తొలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఉండే టాక్సిన్‌లను బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తుంది. మూత్ర సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సోంపు గింజలను తీసుకోవడం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సోంపు గింజలను తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలను తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అయితే ఈ సోంపు గింజల నీటిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

దీన్ని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఒక  కప్పు ఫైనల్ సీడ్స్ తీసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల నీటిలో ఈ గింజలను ఉడికించుకోవాలి.  నీరుని పరగడుపున తాగవచ్చు.  ఇష్టమైతే నిమ్మకాయ పిండుకొని తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

Also Read: Heart Attack: ప్రతిరోజు ఈ పండ్లు తింటే గుండెపోటు రమ్మన్నా రాదు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News