Health Tips Telugu: రోజు 6 ఈ ఆకులను నమిలి తింటే.. మధుమేహం ఎంతున్న తగ్గాల్సిందే!

Health Tips Telugu: ప్రతిరోజు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. రోజు ఉదయాన్నే ఈ ఆకులను నెమలి తింటే పొట్ట సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 15, 2024, 10:02 PM IST
Health Tips Telugu: రోజు 6 ఈ ఆకులను నమిలి తింటే.. మధుమేహం ఎంతున్న తగ్గాల్సిందే!

Health Tips Telugu: ఆయుర్వేద శాస్త్రంలో కరివేపాకు గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా కరివేపాకును రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే  యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులకు సులభంగా చెక్ పెడతాయి. దీంతో పాటు రోజు ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ ను నియంత్రించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీంతోపాటు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. కరివేపాకు గాయాలను నయం చేసేందుకు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ ఆకుల్లో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి. 

ఈ కరివేపాకులు ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీర మొత్తానికి అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. కరివేపాకులో ఉండే గుణాలు చిన్న ఆరోగ్య సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు ఉపశమనం కలిగిస్తారు. ఇవే కాకుండా ప్రతిరోజు కరివేపాకును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయే తెలుసుకోండి.

ఈ ఆకుల్లో ఉండే పోషకాలు: 
కరివేపాకు ఆకుల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో పాటు శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది దీంతోపాటు ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. ఇప్పటికే వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు రోజు ఈ ఆకులను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

పరిగడుపున తింటే ఏమవుతుందో తెలుసా?
ఉదయాన్నే కరివేపాకు ఆకులను నలుగురికి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఆకులతో తయారు చేసిన రసాన్ని ఉదయాన్నే ఒక గ్లాసు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సైలెంట్ కిల్లర్ వ్యాధులన్నీ ఎంతో సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా కరివేపాకును ప్రతిరోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల కంటి సమస్యలు కూడా దూరమవుతారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మధుమేహం సమస్యలకు చెక్:
మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా రోజు కరివేపాకు ఆకులను తినడం వల్ల గొప్ప ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే కొన్ని గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా నియంత్రిస్తారు. అంతే కాకుండా విరేచనాలను తగ్గించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కరివేపాకు ఆకులను తినాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News