కేసీఆర్ సర్కార్ కు పవన్ చురకలు

కేసీఆర్ తీరుపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు సంధించారు.

Last Updated : Dec 7, 2017, 07:00 PM IST
కేసీఆర్ సర్కార్ కు పవన్ చురకలు

తెలంగాణ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రోళ్లు దోచుకున్నారని..ఇష్టమోచ్చినట్లు ఆరోపించిన వారు ఇప్పుడు వారికే కాంట్రాక్టులు ఎందుకిచ్చారు ?... అప్పుడు దోచుకున్న వాళ్లు ..ఇప్పుడు నిజాయితీ పరులుగా మారిపోయారా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇలా దిగజారడం సిగ్గుచేటని పవన్ ఎద్దేవ చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాసర ఐఐఐటీలో చదివే ఆంధ్రా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా ఆపేశారు... ఇలా ఊహించగలమా? అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Trending News