COVID-19 Positive Cases: తెలంగాణలో 500కు చేరువలో కరోనా కేసులు, GHMCలో వైరస్ విజృంభణతో హాస్టళ్లు, మెస్‌లు మూసివేత

Telangana Covid-19 Cases | దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే ఎనభై శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 493 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 25, 2021, 11:50 AM IST
COVID-19 Positive Cases: తెలంగాణలో 500కు చేరువలో కరోనా కేసులు, GHMCలో వైరస్ విజృంభణతో హాస్టళ్లు, మెస్‌లు మూసివేత

Telangana COVID-19 Positive Cases: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుంచి తెలంగాణలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే ఎనభై శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 493 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,791కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 56,464 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 493 మందికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 4 వేల 7 వందల తొంబై ఒకటికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,680కి చేరింది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

గత పది రోజులుగా కోలుకున్న వారి సంఖ్య కన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. బుధవారం నాడు 157 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,99,427 మంది కరోనా మహమ్మారిని జయించారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 138 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం హైదరాబాద్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 

Also Read: Surabhi Vani Devi Car Accident: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి కారుకు ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఏపీ, తెలంగాణలో రీ ఇన్ఫెక్షన్ కారక వేరియంట్ విస్తరిస్తోంది.  తెలంగాణలో నేటి నుంచి హాస్టళ్లు, మెస్‌లు మూసివేయాలని సర్కార్ నిర్ణయం. నేటి మధ్యాహ్నం నుంచి ఓయూ మెస్ మూసివేయనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News