Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం, 11 మంది మృతి

Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..వందలాదిమందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2021, 10:11 AM IST
 Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం, 11 మంది మృతి

Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..వందలాదిమందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఈజిప్టులో ఘోర ప్రమాదం(Egypt Accident) చోటు చేసుకుంది. ఉత్తర కైరోలోని బన్తాలో ప్యాసెంజర్ రైలు పట్టాలు ( Passenger train derailed) తప్పడంతో ప్రమాదం తలెత్తింది. దేశ రాజధాని కైరో (Cairo) నుంచి మన్సౌరాకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా నాలుగు భోగీలు పట్టాలు తప్పడంతో భారీ ప్రమాదం తలెత్తింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడినవారిని రక్షించేందుకు ఆంబులెన్స్, వైద్య సిబ్బంది హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎవరికి వారు ప్యాసెంజర్ రైలులో ఉన్న తమవారిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ ఘటనపై ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన ( Train accident)పై దర్యాప్తుకు ఆదేశించారు. రైలు పట్టాలు తప్పడానికి కారణాలింకా తెలియలేదు. రైలు డ్రైవర్, ఇతర సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Also read: Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఇక చెక్ పడనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News