Kunool Bus Accident: అదుపు తప్పి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..10 మంది గాయాలు..

Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహోబిలం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో  10 మంది గాయపడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 02:32 PM IST
Kunool Bus Accident: అదుపు తప్పి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..10 మంది గాయాలు..

Kunool Bus Accident: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో పది మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా అహోబిలం(Ahobilam) వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే...

ఎగువ అహోబిలం వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(APSRTC Bus) లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: Penna River Bridge: కడపలో కుంగిపోయిన పెన్నానది వంతెన.. రాకపోకలు నిలిపివేత

ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయ(RTC Bus Falling into Valley)లో పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు.. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని బయటకు తీసి రెండు అంబులెన్సుల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి...చికిత్స అందిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News