Dhanush-Aishwaryaa: హైదరాబాద్‌లో ఒకే హోటల్లో ధనుష్, ఐశ్వర్య, విడాకుల తర్వాత ఇలా..

Dhanush and Aishwarya in Same Hotel: ఈ నెల 13న ఐశ్వర్య-ధనుష్ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ.. ఇకపై ఎవరి దారుల్లో వారు నడవాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 12:50 PM IST
  • ఒకే హోటల్లో ఐశ్వర్య, ధనుష్
  • వారం రోజుల క్రితం విడాకులు ప్రకటించిన ఐశ్వర్య, ధనుష్
  • ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోని సితార హోటల్లో
Dhanush-Aishwaryaa: హైదరాబాద్‌లో ఒకే హోటల్లో ధనుష్, ఐశ్వర్య, విడాకుల తర్వాత ఇలా..

Dhanush and Aishwarya in Same Hotel: స్టార్ కపుల్ ఐశ్వర్య-ధనుష్ విడాకులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి వారం రోజులు గడవగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకే హోటల్లో స్టే చేస్తున్నారు. అయితే ఇద్దరు విడివిడిగానే హోటల్లో ఉంటున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని సితార హోటల్లో ప్రస్తుతం వీరిద్దరు ఉన్నట్లు చెబుతున్నారు.

విడాకుల తర్వాత ఐశ్వర్య, ధనుష్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు తలమునకలయ్యారు. ప్రస్తుతం ఐశ్వర్య (Aishwaryaa Rajinikanth) రామోజీ ఫిలిం సిటీలో ఒక సాంగ్‌ను షూట్ చేస్తుండటంతో.. అక్కడి సితార హోటల్లో బస చేస్తున్నారు. అటు ధనుష్ తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించి ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్న షూట్‌లో పాల్గొంటున్నాడు. దీంతో ధనుష్ కూడా అదే హోటల్లో బస చేస్తున్నాడు. విడాకులతో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం ఒకే హోటల్లో స్టే చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నెల 13న ఐశ్వర్య-ధనుష్ జంట తాము విడిపోతున్నట్లు (Dhanush Aishwaryaa Divorce) ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ.. ఇకపై ఎవరి దారుల్లో వారు నడవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తమ నిర్ణయాన్ని గౌరవించి తగిన ప్రైవసీ కల్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు యాత్రా రాజా (15), లింగ రాజా (11) ఉన్నారు. ఈ జంట విడాకుల విషయం కోలీవుడ్‌లో చాలామందిని షాక్‌కి గురిచేసింది.

నిజానికి గతంలోనే ఈ జంట విడిపోయేందుకు సిద్ధపడగా.. రజనీకాంత్ (Rajinikanth) నచ్చజెప్పడం వల్లే కలిసి ఉంటున్నారనే ప్రచారం ఉంది. గతంలో సుచీలీక్స్ సమయంలో ధనుష్ ఇద్దరు హీరోయిన్లతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు బయటకు రావడంతో... అప్పటినుంచి ఐశ్వర్య, ధనుష్‌ల మధ్య విభేదాలు మొదలైనట్లు చెబుతున్నారు. కాగా, ఐశ్వర్య, ధనుష్ (Dhanush Aishwaryaa Divorce) మళ్లీ కలుస్తారనే నమ్మకాన్ని ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెలిబుచ్చడం గమనార్హం. అభిప్రాయ బేధాలే తప్ప.. అదేమీ విడాకులు కాదని... భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ జంట మళ్లీ కలుస్తారా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Also Read: Mahesh Babu: సోదరుడు రమేష్ బాబు పెద్దకర్మకు మహేష్.. కన్నీటిపర్యంతమైన సూపర్ స్టార్

Also Read: IND vs SA 3rd ODI: ఓపెనర్‌గా గబ్బర్ వద్దు.. వెంకటేశ్‌ ముద్దు! భువీ స్థానంలో అతడే బెటర్!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News