Actress Neha Desh Pandey: హీరోయిన్ భర్తకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య డ్రగ్స్ సంబంధాలపై పోలీసుల ఆరా

Actress Neha Desh Pandey: హైదరాబాద్‌లో మత్తు పదార్థాల దందా రెచ్చిపోతూనే ఉంది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా సిటీలో జరిగే సెలబ్రేషన్స్‌పై సిటీ పోలీసులు డ్రగ్స్ కంట్రోల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతుండగా ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 02:56 AM IST
Actress Neha Desh Pandey: హీరోయిన్ భర్తకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య డ్రగ్స్ సంబంధాలపై పోలీసుల ఆరా

Actress Neha Desh Pandey: కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్​ను క్యాష్ చేసుకునేందుకు పబ్​లు, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్లు టార్గెట్ చేసుకొని డ్రగ్స్ భారీ స్థాయిలో సరఫరా జరిగాయి. ఈ వేడుకల్లో మత్తు పదార్థాలదే హవా. మద్యం, గంజాయి, డ్రగ్స్​.. న్యూ ఇయర్ సంబరాల్లో వీటికుండే క్రేజే వేరు. ఆ ఒక్కరోజే కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అని అంచనా. మరి వీటిని అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పటిష్ఠం చేసి పెద్ద ముఠా గుట్టురట్టు చేశారు. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో మత్తు పదార్థాల దందా రెచ్చిపోతూనే ఉంది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా సిటీలో జరిగే సెలబ్రేషన్స్‌పై సిటీ పోలీసులు డ్రగ్స్ కంట్రోల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతుండగా ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరి నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితో పాటూ ఇంటర్ నేషనల్ డీజీ ఈవెంట్ మేనేజర్ మోహిత్‌ను అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షారుక్ ఖాన్ కుమారుడు పట్టుబడిన ఒక డ్రగ్స్ కేసులో కూడా మైరాన్ మోహిత్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయ్యాడో అదే ముంబై క్రూయిజ్‌లో ఆ సమయంలో మైరాన్ డీజే పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ముంబై, గోవాలోని ప్రముఖ పబ్బులకు కూడా అతను డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా అతనికి హైదరాబాద్‌లో పలు పబ్బుల ఓనర్లతో కూడా సంబంధాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో పబ్ ఓనర్స్ ద్వారా ఏమైనా డ్రగ్స్ సరఫరా చేశారా ? అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్స్ పెడ్లర్ మైరాన్ మోహిత్ భార్య అయిన నేహా దేశ్ పాండే ద్వారా 2022 డిసెంబర్ 31న పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పన్నెండేళ్ల ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన మోహిత్ అనేక పబ్‌లలో వెయిటర్‌గా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగినట్లు సమాచారం. అనంతరం పలు డీజేలను తన గుప్పిట్లో పెట్టుకుని డ్రగ్‌ సప్లయర్‌గా మారి వారిని మత్తులోకి దించేవాడు. నేహా దేశ్ పాండే వాట్సాప్ లిస్టులో డ్రగ్స్ సరఫరా చేసిన వారిలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ బిల్డర్‌గా కొనసాగుతున్న కృష్ణ కిషోర్ రెడ్డి కార్యకలాపాలపై పోలీసులు గత కొంత కాలంగా నిఘా వేశారు. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న తరుణంలో కృష్ణ కిషోర్‌పై పోలీసులు మరింత గట్టి నిఘా పెట్టారు. 

ఏదిఏమైనా మైరాన్ భార్య హీరోయిన్ కావడంతో మొత్తం కాంటాక్ట్స్ బయటకు తీస్తున్నారు. పరిశ్రమ వ్యక్తులతో  మైరాన్‌కి ఉన్న సంబంధాలు ఎలాంటివి అనే కోణంలో వివరాలు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న నేపథ్యంలో బయటపడిన తాజా ఉదంతం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి : Extra Marital Affairs: హవ్వ!! మరీ ఇంత బరితెగింపా ? లవర్‌తో మహిళ‌ అక్రమ సంబంధం.. అతడి కోసం కుటుంబంతోనే గొడవ

ఇది కూడా చదవండి : MLA Caught Opening Fire: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఎమ్మెల్యే కాల్పులు.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Haryana Woman Kidnap Case: కారులో కూర్చున్న మహిళని కిడ్నాప్ చేయబోయారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News