MS Dhoni New Look: చిన్ననాటి స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్, సోషల్ మీడియాలో ఫొటో వైరల్

MS Dhoni New Look: గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టులో టీ20, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆపై ఐపీఎల్ 2020లో చెన్నై జట్టుకు మరోసారి ప్రాతినిథ్యం వహించాడు. అయితే జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2021, 03:34 PM IST
MS Dhoni New Look: చిన్ననాటి స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్, సోషల్ మీడియాలో ఫొటో వైరల్

MS Dhoni New Look: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు. జాతీయ జట్టుకు వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి అపూర్వ విజయాలు అందించిన ఘనత ఎంఎస్ ధోనీ సొంతం. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కుటుంబంతో సరదాగా సమాయాన్ని గడుపుతున్నాడు.

ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌ల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్నేహితులను, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటున్నాడు. వారితో సరదాగా సమయం గడుపుతూ విశేషాలు అడిగి తెలుసుకుంటన్నాడు. కొన్ని రోజుల కిందట హిమాచల్ ప్రదేశ్‌లో తన భార్య సాక్షి సింగ్, కూతురు జీవా ధోనీతో వెకేషన్‌కు వెళ్లాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. తన పాత మిత్రులతో సరదాగా లంచ్ చేస్తున్న ధోనీ (MS Dhoni) ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ధోనీతో ఉన్న వారిలో ఒకరు అతడి స్నేహితుడు సీమంత్ లోహణి కాగా, మరో వ్యక్తి ఎవరా అని ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. 

Also Read: Tokyo Olympics 2021: స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ Roger Federer కీలక నిర్ణయం

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07)

ధోనితో పాటు ఇద్దరు స్నేహితులు ఉండటాన్ని ఆ ఫొటోలో గమనించవచ్చు. వెనకాల ఉన్న మరో వ్యక్తి ఓ వింటేజ్ కారును రిపేర్ చేస్తున్నాడు.  రోల్స్ రాయిస్ కారు గురించి సైతం నెటిజన్లు, ధోనీ ఫ్యాన్స్ కామెంట్లు చేుస్తున్నారు. గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టులో టీ20, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆపై ఐపీఎల్ 2020లో చెన్నై (Chennai Super Kings) జట్టుకు మరోసారి ప్రాతినిథ్యం వహించాడు. అయితే జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. 

Also Read: Yashpal Sharma Dies: 1983 వరల్డ్ కప్ విన్నర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూత, పలువురు క్రికెటర్లు సంతాపం

ఈ ఏడాది ఐపీఎల్ 2021(IPL 2021)లో కమ్ బ్యాక్ చేసిన ధోనీ వ్యక్తిగతంగా రాణించకున్నా, అత్యుత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. 7 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. ఎంఎస్ ధోనీ ఏం చేసినా హాట్ టాపిక్ అవడం తెలిసిందే. ఐపీఎల్ 14 సీజన్‌లో కాస్త విరామం దొరకడం తో పాత మిత్రులతో కాలక్షేపం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్‌లో ఈ సీజన్ మిగతా మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News