IPL 2020: ఐపిఎల్ 2020కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. 

Last Updated : Aug 10, 2020, 08:19 PM IST
    1. ఈ ఏడాది ఐపిఎల్ 2020 ( IPL 2020 In UAE ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న విషయం తెలిసిందే.
    2. టీమ్ లు ఆగస్టు 20న బయల్దేరనున్నాయి.
    3. రెండు సార్లు RT PCR టెస్టులు
IPL 2020: ఐపిఎల్ 2020కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఈ మేరకు లీగ్ ప్రెసిడెంట్ బ్రిజేష్ పటేల్ (  Brijesh Patel ) సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపిఎల్ 2020 ( IPL 2020 In UAE ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఇండియన్ క్రికెట్ బోర్డు (BCCI) కు అధికారికంగా అంగీకారం తెలిపింది.

ఐపీఎల్ సీజన్ 13 ( IPL season 13 ) ఈ సారి  సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ లోని షార్జాలో, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో జరగనుంది. భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ అధికంగా ఉండటంతో యూఏఈలో నిర్వహిస్తున్నారు.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు ( Emirates Cricket Board ) భారత ప్రభుత్వం లీగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని తెలియజేసినట్టు బ్రిజెష్ పటేల్ తెలిపారు. తమకు రాత పూర్వకంగా అంగీకార పత్రం లభించింది అని ఈ విషయాన్ని ఐపిఎల్ ప్రాంఛైజీ టీమ్ లకు తెలుపుతాం అన్నారు. టీమ్ లు ఆగస్టు 20న బయల్దేరనున్నాయి అని..రెండు సార్లు RT PCR టెస్టులు నిర్వహిస్తాం అని పేర్కొన్నారు బ్రిజేష్ పటేల్. అయితే మరోవైపు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

Trending News