IND vs AUS: అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టబోం..స్టార్ ప్లేయర్‌పై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..!

IND vs AUS: ఆ స్టార్ ప్లేయర్ కోసం భారత జట్టు అత్రుతగా ఎదురు చూస్తోంది. అతడి రాకతో టీమ్‌ మరింత బలపడనుందని క్రికెట్ పండితులు పండితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Written by - Alla Swamy | Last Updated : Sep 22, 2022, 11:53 AM IST
  • ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్
  • రేపే రెండో టీ20 మ్యాచ్
  • పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
IND vs AUS: అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టబోం..స్టార్ ప్లేయర్‌పై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..!

IND vs AUS: భారత జట్టు స్టార్ పేసర్ బుమ్రాపై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిపై జట్టు ఒత్తిడి పెట్టబోదని తేల్చి చెప్పాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన బుమ్రాకు తగినంత సమయం కావాలని..అది ఇస్తామన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ఐతే తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. దీంతో అతడి రాకపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు.

బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు అని..బౌలింగ్‌పై కాస్త ఆందోళన ఉందని తెలిపాడు హార్దిక్ పాండ్యా. కానీ యువ ఆటగాళ్లపై తాము పూర్తి నమ్మకాని ఉంచామని స్పష్టం చేశాడు. దేశంలోనే ఇప్పుడున్న 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లు అని..అందుకే జాతీయ జట్టులో ఉన్నారని చెప్పాడు. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం లోటేనని..అతడు చాలా ప్రభావం సూపిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఐతే గాయం నుంచి కోలుకుని ఆటగాడికి సమయం ఇవ్వాల్సి ఉందన్నాడు.

బుమ్రాపై ఒత్తిడి పెట్టకూడదన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమి కారణంగానే టీమిండియా ఓడిపోతూ వస్తోంది. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌లో బౌలంగ్ వైఫల్యం బయట పడింది. మరి ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఘోరంగా బౌలింగ్ వేశారు. చివరి మూడు ఓవర్లలో 40 నుంచి 50 పరుగులు ఇవ్వడంతో జట్టు ఓటమి పాలు అవుతోంది. 19వ బౌలింగ్ వేసి బలి అవుతున్న ఆటగాడిగా భువనేశ్వర్ నిలుస్తున్నాడు.

మొన్న ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. డెత్ ఓవర్లలో భారత పేసర్లు భువనేశ్వర్, హర్షల్ పటేల్ ధారళంగా పరుగులు ఇచ్చారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎలా వేయాలన్న దానిపై టీమిండియా ఫోకస్ చేసింది. నెట్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. యార్కర్లు ఎలా వేయాలన్న దానిపై స్టడీ చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో పుంజుకుంటామని భారత ఆటగాళ్లు స్పష్టం చేస్తున్నారు. రేపు నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగబోతోంది. టాస్ గెలిచి జట్టుకే గెలిచే అవకాశం ఉంది. 

Also read:NIA Raids: పీఎఫ్‌ఐయే టార్గెట్‌గా ఎన్‌ఐఏ దాడులు..ఉగ్ర మూలాలపై ప్రత్యేక నిఘా..!

Also read:Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి..? తాజా కేసులు ఎన్నంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News