బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
కరోనా సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
భారత ప్రధాని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. రోడ్ల పక్కన పకోడీలు అమ్ముకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు.
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ని ఎయిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జి చేసింది. ప్రసుత్తం ఆయన పరిస్థితి బాగానే ఉందని.. ఆయన ఆరోగ్య సమస్యలకు తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందని.. ఇతరత్రా మామూలు రుగ్మతలకు ఆయన తమకు రిఫరెన్స్ ఇచ్చిన రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.