మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్పై అనుచితంగా ప్రవర్తించారు.
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
శంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్ను సైతం జారీ చేశారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.