Munugode ByPoll: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులుగా నియోజకవర్గంలోనే మకం వేసిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు సర్పంచ్ లు, ఐదుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది బీజేపీ. ఒకేసారి 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు. చండూరు మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు.తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు హాజరయ్యారు.
Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ఈటల రాజేందర్.
Etela Rajender: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
Etela Rajender: హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.
MUNUGODE BYELECTION: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది.మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. మొదటి నుంచి కమ్యూనిస్టుల కోట. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలు కీలకంగా వ్యవహించారు.
Munugodu ByElection: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే చర్చ జరుగుతోంది.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
Eetala Rajender at VRAs strike: షామీర్పేట మండల కార్యాలయంలో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈటల రాజేందర్ ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి.
Etela Rajender on KCR: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. పంప్ హౌస్లు నీట మునిగి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి పరిహారం చెల్లించాలని కోరారు.
Revanth Reddy: ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా? పార్టీ మారేవారిని ఆయన లైట్ తీసుకుంటున్నారా? లేక పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్లు వెళ్లిపోవచ్చని పక్కపార్టీలవైపు చూస్తున్న నేతలకు ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారా? ఈ చర్చే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ETELA RAJENDER: ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలపై ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలనాధులు
CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే విపక్షాలు దూకుడు పెంచాయి. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు.
Etela Rajender:ఈటల రాజేందర్ ను గజ్వేల్ లో పోటీ చేయించడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా... ఒకేసారి అటు కేసీఆర్ ను ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా మోడీ-షా ద్వయం స్కెచ్ వేసిందని తెలుస్తోంది.
KCR VS ETELA RAJENDER:తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది.
Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.