Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.
Sr NTR Son: నందమూరి తారక రామారావు పేరు కాదు. ఓ చరిత్ర. తెలుగులో తొలి మాస్ హీరోగా దాదాపు ముప్పై యేళ్లు నెంబర్ వన్ హీరోగా రఫ్పాడించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సీఎంగా అధికారం చేపట్టి సంచలనం రేపారు. ఈయన కుమారుల్లో ఒకతను ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా..
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Ajith: కేంద్రం 2025 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో తెలుగులో సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. అటు తమిళనాడు సూపర్ స్టార్ అజిత్ తో పాటు శోభన, శేఖర్ కపూర్ సహా పలువురిని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో అజిత్ తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేయడంతో పాటు పద్మభూషణ్ వరకు అజిత్ సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Padma Bhushan Awards 2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.
Nandamuri Balakrishna: టాలీవుడ్ దిగ్గజ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. సినీరంగంలో ఆయన సేచిన సేవలను గుర్తించిన ప్రభుత్వం..ఈ అరుదైన గౌరవం కల్పించింది.
Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
Mithun Chakraborty Honoured With Dadasaheb Phalke Award : మన దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యున్నత ప్రతిష్ఠాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. 2022 యేడాదికి గాను మిథున్ చక్రబర్తిని సినీ రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
Hanu Man - Venkaiah Naidu: మన భారతీయ ఇతిహాసంలో రియల్ సూపర్ హీరో హనుమాన్. ఆయన స్పూర్తితో తెరకెక్కిన చిత్రం హను మాన్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించి ఇప్పటికీ స్టడీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా మూవీని చూసిన మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్ను అభినందించారు.
Usha Uthup - Padma Bhushan: కేంద్రం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది పలు రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్రం. అందులో సినీ రంగం నుంచి వైజయంతిమాల బాలి, చిరంజీవిలకు పద్మవిభూషణ్తో గౌరవిస్తే.. మిథున్ చక్రబర్తి, ఉషా ఉతుప్లకు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Mithun Chakraborty - Padma Bhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి హీరోగా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ను కొన్నేళ్లు పాటు ఏలిన బెంగాలీ బాబు మిథున్ చక్రబర్తిని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Vijayakanth - Padma Bhushan: కేంద్రం తమిళ ప్రజల ఆరాధ్య నటుడు దివంగత కెప్టెన్ విజయకాంత్ను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.రీసెంట్గా కన్నుమూసిన విజయకాంత్.. సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. అంతేకాదు అంతకు మించి మనసున్న మనిషిగా ప్రజల్లో ఆయన పట్ల గౌరవం ఉంది.
Jourey of Sundar Pichai: తమిళనాడులోని మధురైలో జన్మించి.. ఎన్నో కష్టాలు పడి స్టాన్ఫోర్డ్ యూనివర్సీటిలో చదువుకుని.. ఇప్పుడు గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ లైఫ్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. తాజాగా పద్మభూషణ్కు ఎంపికైన సుందర్ పిచాయ్ జర్నీపై ఓ లుక్కేయండి.
PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు ధరించి..డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ మసాలా కంపెనీ ఎండీహెచ్ (Mahashian Di Hatti ) యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటి (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.