తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్స్ గానే పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గ్రీన్ జోన్లలో సడలింపులు ఉన్నప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
లాక్డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే 10th Class Exams ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు.
మంత్రి కేటీఆర్ ( Minister KTR ) జలుబుతో బాధపడుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ జలుబుతో బాధపడటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సేవలో ముందున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లకు ( Bhainsa riots ) ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపి ఎంపీ సోయం బాపూరావు ( BJP MP Soyam Bapu Rao ) డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఏమీ తెలియని అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
దేశం అంతా ఒకే రకమైన విధానం అమలయ్యేలా విద్యుత్ వ్యవస్థను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టరూపం దాల్చితే రైతన్నలు, ఎస్సీ, ఎస్టీలకు లభించే సబ్సిడీపై ప్రభావం పడుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) అన్నారు.
కరోనావైరస్ కట్టడికి లాక్డౌన్ విధించగా.. ఆ లాక్డౌన్ని ఎప్పుడు ఎత్తివేస్తారో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి లేనందున తెలంగాణలో నిర్వహించబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2020 ( Telangana SSC exams 2020 ) విషయంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. అంతేకాకుండా కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది.
తెలంగాణలో రోజూ వారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండటం అటు తెలంగాణ సర్కార్కి ఇటు కరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజానికానికి కొంత ఊరట కలిగిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 7కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 2కి పడిపోవడం గమనార్హం.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమవడం విశేషం.
గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.