ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్టంలోని ఎస్టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
2018 జులై నుండి అమలు చేయాల్సి ఉన్న పీఆర్సీని (PRC) తెలంగాణ సర్కార్ మరోసారి ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( TSUTF ).. టీచర్స్ పట్ల సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల కోసం కోత్తగా 55 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల సృస్టించి, గ్రామాల్లో సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డీ.జీ. జితేందర్ లు పర్యటించారు.
జాతీయ స్థాయిలో వివిధ రంగాలు, విభాగాల్లో ఉత్తమ సేవలు అందించి, ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన సంస్థలు, అధికార యంత్రాంగాలకు అందించే స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులలో ఐదు అవార్డులు తెలంగాణను వరించాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్న ఐజీఎస్టీ నిధులను(IGST funds) కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.35,298 కోట్ల నిధులలో భాగంగానే తెలంగాణకు రావాల్సి ఉన్న రూ.1,036 కోట్లను సైతం విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తెలంగాణాలో మద్యాన్ని నిషేదించడంతో పాటు మద్యం నియంత్రణకు కఠినమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు డికె అరుణ దీక్ష కొనసాగనుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో బస్సులు నడిపి ప్రజా రవాణా సౌకర్యానికి సహకరించిన తమకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC)ని భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఉంటాయనే విషయంలో రవాణా శాఖ అధికారులు, నిపుణులతో కలిసి సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె(TSRTC strike) విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ కార్మికుడు సోమవారం రాత్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt) న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావ్ డిమాండ్ చేశారు. సమ్మె(TSRTC strike) విరమించిన తర్వాత కూడా ఇంకా వారిని విధుల్లో చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా దెదిరింపు ధోరణికి పాల్పడటం అన్యాయమని అన్నారు.
తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ(TSRTC MD Sunil Sharma) తేల్చిచెప్పారు. తమంతట తాముగా సమ్మె(TSRTC strike)కు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని.. కార్మికులు ఇప్పటికే యూనియన్ల(TSRTC JAC) మాట విని నష్టపోయారని ఆయన స్పష్టంచేశారు.
తెలంగాణలోని పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.