టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను, సమ్మె అనంతరం జరుగుతున్న పరిణామాలు, కార్మికుల డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు... కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
టిఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రభుత్వం తమపై అవలంభించిన వైఖరిపై, సమ్మె సమయంలో ఛలో ట్యాంక్ బండ్ నిరసనలో పోలీసులు తమపై చేసిన దాడులను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలు, మిలియన్ మార్చ్ నిరసనలో పోలీసుల చేతిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను తీసుకుని వెళ్లి గవర్నర్కి ఫిర్యాదు చేస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను పక్కనపెడితేనే వారి డిమాండ్లను పరిశీలించాలని.. లేదంటే అవసరమే లేదని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.