Jangaon accident: డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మణం.. మృతుల్లో ఆరేళ్ల పాప..

Jangaon accident: ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారితో సహ మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం జనగామ జిల్లాలో  జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2023, 09:47 AM IST
Jangaon accident: డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మణం.. మృతుల్లో ఆరేళ్ల పాప..

Jangaon Road accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident in Janagama) జరిగింది. పెంబర్తి నేషనల్ హైవేపై ఇవాళ తెల్లవారుజామున ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరేళ్ల పాప కూడా ఉంది. డీసీఎంకు పంక్చర్ కావడంతో దాని టైర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

స్థానికులు సమాచారం అందిచడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ముగ్గురి డెడ్ బాడీస్ ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు ఇంకా ఎవరనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: China accident: 10 నిమిషాల్లో 49 వాహనాలు ఢీ.. 16 మంది మృత్యువాత.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News