Huzurabad byelection: 'ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు'- ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

Etala Rajender: టీఆర్​ఎస్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్​. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 02:43 PM IST
  • టీఆర్​ఎస్​పై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
  • హుజూరాబాద్​ ఉప ఎన్నికలో విజయం కోసం ఎమ్మెల్యేలే డబ్బులు పంచారని ఆరోపణ
  • పోలింగ్ అనంతర పరిణామాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
Huzurabad byelection: 'ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు'- ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

Huzurabad byelection: ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్​ ఉప ఎన్నికకు శనివారం (Huzurabad by Polls) పోలింగ్ పూర్తయింది. రికార్డు స్థాయిలో 86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో విజయం తమదంటే తమదని ప్రధాన పార్టీలైన టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

నవంబర్​ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల నోటిఫికేషన్​లో పేర్కొంది ఈసీ

ఆగని విమర్శలు..

అయితే పోలింగ్ ముగిసినా కూడా నేతల మధ్య విమర్శాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​పై సంచలన (Etala Rajender fire on TRS party) వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంటలో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచారని ఆరోపించారు. డబ్బులిచ్చి ప్రజాభిప్రాయం మార్చడం, డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదన్నారాయన.

Also read: MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Aslo read: Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్

పోలింగ్​కు ముందు మద్యం పంచి, డబ్బులిచ్చి, దాడుల ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారని (BJP vs TRS) టీఆర్​ఎస్​ను ఉద్దేశించి పేర్కొన్నారు ఈటల. అయితే అవన్నీ దాటుకుని ఓటు వేసినా.. బస్సుల్లో ఆ ఈవీఎంలు మార్చారని, వీవి ప్యాట్​లను ప్రైవేటు వాహనాల్లో తరలించినట్లు కూడా తమకు సమాచారం అందినట్లు తెలిపారు ఈటల. ఓటు వేసిన బాక్స్​లను మాయం చేయడం దుర్మార్గమన్నారు.

పొరపాటు జరిగినట్లు కలెక్టర్ అంగీకరించారని.. ఉత్కఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా అని అన్నారు. తనను ఓడించేందుకు కేసీఆర్ (Etala Rajender on KCR) అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఈ ఎన్నికల్లో టీఆర్​ఎస్ వ్యవహరించిందన ధ్వజమెత్తారు. అయినా చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also read: Huzurabad Badvel Bypoll : హుజూరాబాద్‌లో పోటెత్తిన ఓటర్లు.. బద్వేలులో తగ్గిన పోలింగ్

Aslo read: Huzurabad exit poll results: హుజూరాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరాలు

అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు..

ఈ విషయంలో అధికారులు టీఆర్​ఎస్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. వీటన్నింటిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈటల రాజేందర్​.

స్వయంగా సీపీ చెప్పినా.. దాడులను అడ్డుకోలేకపోయారన్నారు ఈటల. పైగా వీటిని అడ్డుకునే ప్రయత్నంలో తమ వారిపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణకు ఆదేశం..

ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో సీఈఓ చర్యలు ప్రారంభించారు చీఫ్​ ఎలక్షన్ ఆఫీసర్​ శశాంక్​ గోయల్​. వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, ఆర్వోకు ఆదేశం జారీ చేశారు.

దీనితో పాటు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నారు శశాంక్ గోయల్​. నవంబర్ 2న ఓట్ల లెక్కుపు జరగనుంది.

Also read: Jagga Reddy About KCR: ‘సమైక్యవాదంతో ముందుకొస్తే కేసీఆర్ కు నేను మద్దతిస్తా’

Aslo read: New excise policy in Telangana: దీపావళి తర్వాత తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News