ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో మండిపడిన మంత్రి హరీష్ రావు

ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో మండిపడిన మంత్రి హరీష్ రావు

Last Updated : Sep 26, 2019, 04:56 PM IST
ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో మండిపడిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆర్డీవో శ్రీనుకు మంత్రి హరీష్‌ రావు పదిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదని.. దీంతో చివరికి ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్‌కి ఫోన్‌ చేసి ఆర్డీవోతో తనకు ఫోన్ చేయించాలని చెప్పినప్పటికీ.. ఆర్డీవో స్పందించలేదని తెలుస్తోంది. ఆర్డివో నుంచి ఫోన్ కాల్ కోసం ఎంతసేపు వేచిచూసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి హరీష్‌రావు.. తానే స్వయంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. 

ఈ విషయంలో ఆర్డివో వైఖరిపై తీవ్రంగా మండిపడిన మంత్రి హరీష్ రావు.. స్వయంగా మంత్రి ఫోన్ చేస్తేనే స్పందించకుంటే, ఇక సామాన్య ప్రజలకు ఏం స్పందిస్తారని ఆర్డివోను మందలించినట్టు వార్తలొస్తున్నాయి.

Trending News