Monsoon: తెలంగాణలో ఇక వానలే వానలు.. ఇవాళే రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ..

Monsoon: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఆదివారం ఆంధ్రా తీరాన్ని తాకిన రుతుపవనాలు.. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jun 13, 2022, 07:37 AM IST
  • వేగంగా విస్తరిస్తున్న నైరుతి
  • తెలంగాణలోకి ఇవాళ ఎంట్రీ
  • తెలంగాణలో మొదలైన వర్షాలు
Monsoon: తెలంగాణలో ఇక వానలే వానలు.. ఇవాళే రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ..

Monsoon: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఆదివారం ఆంధ్రా తీరాన్ని తాకిన రుతుపవనాలు.. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాలు సోమవారం తెలంగాణ నేలను తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ఎంట్రీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలు దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఏపీ తీరాన్ని తాకడంతో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. రాయలసీమతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
గత 24 గంటల్లో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి రుతుపవనాల. అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన భాగాలకు రాబోయే రెండు, మూడు రోజుల్లో విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణ భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో భానుడి భగ్గమంటున్నాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే రుతుపవనాల ఎంట్రీతో చల్లటి వాతావరణం ఉండబోతోంది.

Read also: Telangana schools: తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం  

Read also: Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News