Viral news: మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

ఓ మహిళ ప్రాణాలను ఓ కోడిగుడ్డు బలిగొంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగుచూసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 12:33 PM IST
  • నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
  • ఉడికించిన కోడిగుడ్డు నోట్లో పెట్టుకున్న మహిళ
  • అది గొంతులో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి
Viral news: మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

Nagarkurnool: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సాధారణంగా పండ్ల గింజలు, కాయిన్స్ పిల్లల గొంతులో ఇరుక్కొని చనిపోయిన సంఘటనలు చూసుంటాం. కానీ కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్మ(50) ఇంట్లో భోజనం చేస్తూ ఉడకబెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకోగా.. గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే పడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి గొంతులో గుడ్డుని బయటికి తీసే ప్రయత్నం చేశారు.. ఈలోగానే ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Also read: wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం... గోడ కూలి ఐదుగురి మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x